లోక్ సభ ఎన్నికలలో మహిళలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి: ఎమ్మెల్యే

– ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలి
– కాంగ్రెస్ పార్టీ మహిళా సమ్మేళనంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట 
లోక్ భ  ఎన్నికలలో మహిళలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీ అభ్యర్థి మల్లురవిని గెలిపించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఎఐసిసి పరిశీలకులు పీవీ మోహన్ లు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా సమ్మేళనం కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ  రుణం తీసుకోవడానికి ఇదే సరైన సమయం.మహిళలకు అన్ని రంగాల్లో హక్కులను రిజర్వేషన్లను కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరా గాంధీ అని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మహాలక్ష్మి హామీ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి ప్రతి స్త్రీకి వార్షికంగా రూ.ఒక లక్ష ఆర్థిక సహాయం., సగం జనాభా, పూర్తి హక్కులు, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు  50% రిజర్వేషన్లు, శక్తి కా సమ్మాన్ కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్‌వాడీ, ఆశా కార్యకర్త , మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తుందన్నారు. అధికార మైత్రిలో భాగంగా మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించడానికి, అవసరమైన సహాయం అందించడానికి అధికార మైత్రి రూపంలో ప్రతి పంచాయతీలో ఒక పారాలీగల్, అంటే న్యాయ సహాయకుడిని నియమిస్తారు. సావిత్రీబాయి ఫూలే హాస్టల్ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కనీసం ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను ఏర్పాటు చేస్తామని, దేశవ్యాప్తంగా ఈ హాస్టళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని పార్టీ హామీ ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా సాధిారతకు పాటుపాడుతుందనీ, మహిళలకు ఆర్టీసి బస్సు లో మహిళకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ మొదలైన అనేక హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెసు ప్రభుత్వం కు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలోఎంపీ అభ్యర్థి డా మల్లు రవి  సతీమణి శ్రీమతి రాజ భాన్సి దేవి,  ఎన్నికల అచ్చంపేట ఇన్చార్జి రాము యాదవ్, అమ్రాబాద్ జెడ్పీటీసీ డా.అనురాధ , రాష్ట్ర మహిళా నాయకులు శారదమ్మ , కౌన్సిలర్ సునీత, మహిళా కాంగ్రెస్ నాయకులు సుశీల వివిధ గ్రామాల మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Spread the love