సబ్ స్టేషన్ ఎదుట రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

నవతెలంగాణ- నసురుల్లాబాద్ 
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాడు నసురుల్లాబాద్  విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ రైతాంగానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసిస్తూ వీరు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రైతులపై ఉన్న డొల్ల ప్రేమ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బట్టబయలైందని నసురుల్లాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రైతాంగం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు రాబోయే ఎన్నికలలో గట్టి జవాబు ఇస్తారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పాల్త్య విఠల్, జడ్పి కో అప్షన్ మెంబర్ మజీద్, సొసైటీ అధ్యక్షులు మారుతి పటేల్, గంగారాం, నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ సింగ్, కంది మల్లేష్, పురం వెంకట రమణ, పవన్ గౌడ్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love