అంగన్వాడీల సమ్మె నోటీసు అందజేత

నవతెలంగాణ- ముత్తారం
సమస్యలు పరిష్కరించాలని ఈనెల 11 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ఐసీడీఎస్, సీడీపీవోకు సమ్మె నోటీసు తహసిల్దార్ రాజేశ్వర్ కి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) మండల అధ్యక్షురాలు శోభ మాట్లాడుతూ .. ఆగస్టు 18న జరిగిన చర్చల్లో రాష్ట్ర మంత్రి ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో సమ్మెకు పోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  సత్యవతి, రమాదేవి ,సుజాత ,పద్మ ,రజిత, రమాదేవి ,సుమతి ,తిరుపతమ్మ  తదితరులు పాల్గొన్నారు.
Spread the love