- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో మరో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియా వేదికగా జరిగిన అనుచిత, అవమానకర ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. జాయింట్ సీపీ శ్వేత ఆధ్వర్యంలో ఈ సిట్ పనిచేస్తుందని, న్యాయవ్యవస్థపై జరిగిన ఈ దుష్ప్రచార మూలాలను పూర్తిగా వెలికితీస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- Advertisement -



