కాంగ్రెస్ దే గెలుపు.. మొదటిగా గెలిచేది అశ్వారావుపేట సీటే

నవతెలంగాణ – అశ్వారావుపేట
వచ్చే ఎన్నికల్లో దేశ,రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ దే గెలుపు అని, మొదటిగా గెలిచేది,అత్యధిక మెజారిటీ వచ్చేది అశ్వారావుపేట సీటే నని మాజీ ఎం.పి,కాంగ్రెస్ ఎన్నికల ప్రచార రాష్ట్ర కో – కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జారే ఆదినారాయణ అద్యక్షతన నియోజక వర్గం స్థాయీ ప్రజా ప్రతి నిధులు, నాయకులు చేర్చుకునే కార్యక్రమాన్ని శనివారం స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులను, మండల స్థాయి నాయకులను కాంగ్రెస్ జెండా మెడలో వేసి పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో గ్రూపులు ఏమీ లేవని ఉంటే గింటే ఆది రాహూల్ గాంధీ గ్రూపు మాత్రమేనని చమత్కరించారు.ఏ నియోజక వర్గంలో అధిష్ఠానం ఎవరికి ‌సీటు ఇచ్చినా ఓటు మాత్రం హస్తం గుర్తు కే వేస్తామని,విజయం సాధించేది మువ్వన్నెల జెండా మాత్రమే అని హర్షం వ్యక్తం చేసారు. కొత్త నీరు వచ్చి కొత్త నీటిలో కలిసిపోతుంది. అని అలాగే పాత కొత్త లేకుండా కాంగ్రెస్ పార్టీగానే అందరం కలిసి పనిచేస్తామని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించాలన్నా, రైతుకు మేలు జరగాలన్నా, పేదలకు సంక్షేమం పెరగాలన్నా కాంగ్రెస్ గెలవాలని అన్నారు. కలిసికట్టుగా పని చేద్దాం కల్వకుంట్ల కుటుంబ ఆధిపత్యానికి బ్రేకులు వేద్దాం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జూపల్లి రమేష్, మొగళ్ళపు చెన్నకేశవరావు, వగ్గెల పూజ, ఎంపిటీసీలు నండ్రు జయ భారతి రమేష్, వేముల భారతి ప్రతాప్, సత్యవరపు తిరుమల బాలగంగాధర్, సర్పంచ్ లు రమ్య, లింగయ్య, కొమరం బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love