అతిరథ భగీరథుడు షబ్బీర్ అలీ: జిల్లా పరిషత్ ఫ్లోర్ రైడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి

నవతెలంగాణ- సదాశివ నగర్
అతిరథ భగీరథుడు మహమ్మద్ షబ్బీర్ అలీ అని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సహకారంతో కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చిన మహనీయుడు మహమ్మద్ షబ్బీర్ అలీ అని ఆదివారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ… మల్లన్న గుట్ట వద్ద వాటర్ ప్లాంట్ నిర్మించిన ఘనత సభ్యురాలు దక్కుతుందని అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బి ఆర్ ఎస్ నాయకులు, ప్రజా, రైతు సమస్యలను గాలికి వదిలి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ బి ఆర్ ఎస్ కు ఓటు వేస్తే ప్రతి ఒక్కరికి, అడుక్కొనడానికి చిప్ప చేతికొస్తుందని, ప్రజలు గమనించాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసుకునే బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మద్దెల భాగయ్య, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లింగారెడ్డి, బి పేట నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love