యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ ఆలోచనే వద్దు : ఆజాద్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉమ్మడి పౌరస్మృతి బిల్లు రూపకల్పన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న వేళ​.. కశ్మీరీ సీనియర్‌ నేత.. డెమొక్రటిక్‌ ప్రొగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ చైర్మన్‌ గులాంనబీ ఆజాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ గురించి ఆలోచనే చేయొద్దంటూ కేంద్రంలోని బీజేపీకి సూచించారాయన. యూసీసీ అనేది చాలా సంక్లిష్టమైన అంశం. ఆర్టికల్‌ 370 (జమ్ము కశ్మీర్‌ ప్రత్యేక హోదాకు సంబంధించి..) రద్దు చేసినంతలా సులువు కాదు. ఎందుకంటే.. ఇది కేవలం ముస్లింలతో ముడిపడిన అంశం కాదు. క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, గిరిజనులు.. ఇలా అందరితో ముడిపడి ఉంది. అన్ని మతాలకు, వర్గాలకు ఆగ్రహం తెప్పించే అంశం ఇది. ఏ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. అలాగే కేంద్రంలోని బీజేపీకి కూడా. కాబట్టి.. అసలు ఉమ్మడి పౌర స్మృతి ముందడుగు వద్దని.. అసలు ఆ ఆలోచనే వద్దని కేంద్రానికి సూచించారాయన.

Spread the love