నవతెలంగాణ – హైదరాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు మంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతి పండుగలో గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత నిబిడీకృతమై ఉంటుంది. ఇస్లాంపై విశ్వాసం ఉన్నవారు రంజాన్ను ఎంత భక్తి, శ్రద్ధలతో జరుపుకొంటారో బక్రీద్నూ అంతే నిష్టతో చేస్తారు. ఈ పండుగ ముస్లింలందరికీ భగవదనుగ్రహం కలుగచేయాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ పేర్కొన్నారు.