బండి సంజెయ్ అభివృద్ది చేయలేదు.. అభివృద్ధి చూసి బీఆర్ఎస్ కు..

నవతెలంగాణ- వీర్నపల్లి:  వీర్నపల్లి మండల కేంద్రం లో బీజేపీ మండల ఉపాధ్యక్షులు న్యాత వినోద్ బీజేపీ పార్టి సభ్యత్వం కు, మండల ఉపాధ్యక్ష పదవికి శుక్ర వారం రాజీనామ చేసారు. ఈ సందర్భంగా వారు వినోద్ మాట్లాడుతు గత ఆరు సంవత్సరాల నుండి బీజేపీకి క్రియ శీలకంగా పని చేసిన ఎంపి బండి సంజేయ్ గెలుపు కోసం కృషీ చేసిన ఐదు సంవత్సరాలు గడిచిన ఎంపీ బండి సంజయ్ అభివృద్ధి చేయలేదు గర్జనపల్లి గ్రామానికి గాని, మండలంలో ఏ గ్రామానికి కూడా ఒక్క లైటుగానీ, సిసి రోడ్డు గానీ వేయ లేదు అభివృద్ధి చేయక పోవడం బాధాకరం మంత్రి కేటీఆర్ చేసిన అభివృద్ది చుసి బీజేపీ కి పార్టీకి రాజీనామ చేశాను. అభివృద్ధి ఎ పార్టి చేస్తుందో యువకులూ చుసి ఆలోచించి అడుగు వేయాలని అన్నారు. విరి వెంట యువకులూ ఉన్నారు.

Spread the love