నవతెలంగాణ- హైదరాబాద్: ఐపీఎల్-17 సీజన్లో భాగంగా హైదరాబాద్, బెంగళూరు జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 8 మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన బెంగళూరు.. చివరి స్థానంలో కొనసాగుతోంది.
బెంగళూరు జట్టు: కోహ్లీ, డుప్లెసిస్, పాటిదార్, గ్రీన్, జాక్స్, దినేశ్ కార్తీక్, మహిపాల్, కరణ్శర్మ, ఫెర్గూసన్, సిరాజ్, యశ్ దయాల్.
హైదరాబాద్ జట్టు: అభిషేక్, మార్క్రమ్, క్లాసెన్, నితీశ్, అబ్దుల్ సమద్, షెహబాజ్ అహ్మద్, కమిన్స్, భువనేశ్వర్, ఉనద్కత్, మయాంక్, నటరాజన్.