– మొత్తం 47,461 మంది దరఖాస్తు
– ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వాహణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం మొత్తం 47,461 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 209 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. హల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రం వివరాలు ముందుగానే సరిచూసుకోవాలని తెలిపారు. చివరి నిమిషంలో టెన్షన్ పడొద్దనీ, నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి రావాలని సూచించారు.