నవతెలంగాణ-మిడ్జిల్
మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు బీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పాండు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుధా బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్, బాలు, సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షులు జంగారెడ్డి, దోనూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,టౌన్ అధ్యక్షులు జగన్ గౌడ్,మండల నాయకులు జైపాల్ రెడ్డి, గంజి శేఖర్, కరుణాకర్ రెడ్డి, గంజి కృష్ణ, జగన్ గౌడ్ సుకుమార్, నామాని శ్రీనివాసులు, ఆచారి మతిన్, చెన్నయ్య, రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
- Advertisement -
- Advertisement -



