పథకాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం

– బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
నవతెలంగాణ-వీణవంక
పథకాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని వల్బాపూర్, నర్సింగాపూర్ గ్రామాల్లో బీజేపీ పల్లె బాట కార్యక్రమం పేరిట బుధవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు రేషన్ కార్డులు అందించకుండా జాప్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని పథకాలకు రేషన్ కార్డులను ముడిపెట్టడం వల్ల అర్హులు సైతం నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాడ గౌతం రెడ్డి, సీహెచ్ నర్సింహారాజు, ఆదిరెడ్డి, వినోద్ కుమార్, తిరుపతి రెడ్డి, దేవేందర్ రెడ్డి, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love