కేసీఆర్ రోడ్ షో కు భారీగా తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండలంలోని పలు గ్రామాల నుంచి గ్రామానికి రెండు బస్సుల చొప్పున బి ఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సభకు మహిళలు బీఆర్ఎస్ అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. సోమవారం టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం నిజాంబాద్ లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ భారీ బహిరంగ సభకు బి ఆర్ ఎస్ అధినేత చంద్రశేఖర రావు హాజరు కావడంతో మండలంలోని అన్ని గ్రామాల నుంచి బస్సుల ద్వారా మహిళలు రైతులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. అన్ని గ్రామాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలించడానికి ఎంపీపీ కుంచాల విమల రాజు భారీ ప్రయత్నాలు చేస్తున్నారు.
Spread the love