దారుణం.. ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు
కె. సంతోష్ (40) అనే వ్యక్తి ఆస్తి కోసం తన తండ్రి.. శ్రీ అమృత సాగో ఇండస్ట్రీస్ యజమాని ఎ. కులందైవేలు(63)పై దాడి చేశాడు. అయితే రెండు నెలలో నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 18న గుండె పోటుతో మరణించాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు… pic.twitter.com/K2SMv8odz8
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2024
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులో ఓ కొడుకు కన్న తండ్రిపై పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. ఆస్తి కోసం డిమాండ్ చేస్తూ.. సోపాలో కూర్చుని ఉన్న తండ్రి ముఖంపై ముష్టిఘాతాలు కురిపించాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లినట్టే వెళ్లి మళ్లీ వచ్చి పిడిగుద్దులు గుద్దాడు. అంతటితో ఆగక కాలితో ముఖంపై బలంగా తన్ని వెనక్కి వెళ్లాడు. దాంతో తండ్రి స్పృహతప్పి సోఫాలో ఒరిగిపోయాడు. అయినా మరోసారి దాడి చేస్తేందుకు వస్తుండగా ఓ వ్యక్తి అడ్డుకుని పక్కకు తీసుకెళ్లాడు. ఈ హృదయవిధారకమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కన్న తండ్రిపై పాశవికంగా దాడి చేసిన కొడుకుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి కొడుకులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. కొడుకు చేతిలో చావుదెబ్బలు తిన్న 63 ఏళ్ల వృద్ధుడి పేరు ఎ కులందైవేలు. ఆయన ‘శ్రీ అమృత సాగో ఇండస్ట్రీస్’ పేరుతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా సాబుదనా వ్యాపారం చేస్తున్నాడు. ఆస్తిపాస్తులు బాగానే సంపాదించాడు. ఈ క్రమంలో తనకు ఆస్తి రాసివ్వాలంటూ కొడుకు సంతోష్ తండ్రితో నిత్యం గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే గత ఫిబ్రవరి 16న ఆస్తి కోసం తండ్రితో గొడవపడి తీవ్రంగా కొట్టాడు. కొడుకు కొట్టిన దెబ్బలకు తాళలేక స్పృహ తప్పిన కులందైవేలును కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటు రావడంతో ఏప్రిల్ 18న తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంట్లోని సీసీ ఫుటేజ్ను పరిశీలించగా ఈ పాశవిక దాడికి సంబంధంచిన వీడియో బయటపడింది.