- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల పరిధిలోని కొయ్యూరు 6వ వార్డులో రూ.10 లక్షల ఈజిఎస్ నిధులతో సీసీరోడ్డు నిర్మాణ పనులు శనివారం గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ, ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ ప్రారంభించారు. అడుగగానే నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



