- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలపై సిసిఎస్ టీం మెరుపు దాడి చేశారు.నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ మస్తాన్ వలీ, ఆధ్వర్యంలో సిబ్బంది ఈ మెరుపు దాడిలో పాల్గొన్నారు. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పక్కాగా అందిన సమాచారం మేరకు సిసిఎస్ ఏసీపీ మస్తాన్ వలీ, సిబ్బందితో మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు 14టైర్ల లారీలు, ఇద్దరు డ్రైవర్లను, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం వేల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బర్ల సంజీవ్ కు అప్పగించినట్లు సిసిఎస్ ఏసీపీ మస్తాన్ వలీ తెలిపారు.
- Advertisement -



