నేటి తరానికి చేగువేరా పోరాటాలు స్ఫూర్తిదాయకం..

– దుబ్బాకలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేగువేరా జయంతి వేడుకలు
నవతెలంగాణ – దుబ్బాక
చేగువేరా స్ఫూర్తితో విద్యా, ఉపాధి అవకాశాలపై పోరాటాలకు నేటితరం యువత సన్నద్ధం కావాలని ఎస్ఎఫ్ఐ మండల నాయకులు సింగ్ రెడ్డి నాగరాజు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక లోఎస్ఎఫ్ఐ కార్యాలయంలో చేగువేరా 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల నాయకులు సింగిరెడ్డి నాగరాజు “చే” చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేగువేరా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేసి పేద ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత చేగువేరాదని వారు అన్నారు. వైద్య వృత్తిని పక్కనపెట్టి విద్యార్థి యువత కార్మిక కర్షక ప్రజలను ఆదుకోవడానికి సామ్రాజ్యవాదుల గుండెల్లో రైలులా పరిగెత్తిన గొప్ప పోరాట యోధుడు చేగువేరా అని వారు కొనియాడారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాలు నిర్వహించిన గొప్ప పోరాట యోధుడు చేగువేరా అని వారు అన్నారు. ఎన్నో మంత్రి పదవులు అనుభవించిన మంత్రి పదవిలో ఉన్న అని చూడకుండా కార్మికులతో కలిసి పని చేసిన గొప్ప నాయకుడు అని వారు అన్నారు. నేటితరం వైద్యులు చేగువేరా స్ఫూర్తితో ఉచిత వైద్యం అందించడానికి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. చె” స్ఫూర్తితో నేటితరం యువత ఉద్యోగ ఉపాధి సాధనకై పోరాటాలకు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా వారి హక్కులను కాలరాస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పొరేటర్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికొక ఉద్యోగం కల్పిస్తామని కెసిఆర్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని వారు ఈ సందర్భంగా అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు యువత సన్నద్ధం కావాలని వారు పిలిపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, కొండల్ రెడ్డి, జ్ఞాన్ కుమార్ ,విష్ణు, శ్రీనివాస్, వినీత్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love