అంగన్వాడి కార్యకర్తల న్యాయమైన కోరికలు తీర్చాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి ప్రభాకర్ రెడ్డి

నవతెలంగాణ-ధర్మసాగర్ 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి న్యాయమైన కోరికలు తీర్చాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల  తాసిహీల్దార్ కు అంగన్వాడి సమ్మె నిర్వహిస్తామని మెమోరండాలి సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందారని వారికి కనీస వేతనాలను 25 వేల రూపాయలను అందివ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి కార్యకర్తలకు పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర పిలుపుమేరకు హనుమకొండ ప్రాజెక్టులోని ధర్మసాగర్ మండలం రేపటి నుండి సమ్మెను నిర్వహిస్తామని ఈ సందర్భంగా తాసిల్దార్ గారికి మెమోరండం సమర్పించారు. వారి న్యాయమైన కోరికలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో జిల్లా సిఐటియు నాయకులు వేల్పుల సారంగపాణి, మండల అంగన్వాడి కార్యకర్తల అధ్యక్షులు బొడ్డు వసంత, బేబీ రాణి, లత తదితరులు పాల్గొన్నారు.
Spread the love