పందిల్లలో పదవ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం

నవ తెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలోని శ్రీవేకనంద గురుకుల విద్యాలయం 1999 -2000 విద్యా సంవత్సరంలో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీమయ సమ్మేళనం నిర్వహించారు. 23 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం హర్షం వ్యక్తం చేశారు.శ్రీవేకనంద గురుకుల విద్యాలయంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉన్న స్థానంలోనే కాకుండా మరింత ఉన్నతి సాధించాలని ప్రధాన ఆచార్యులు చిట్టి గోపాల్ రెడ్డి ఆకాంక్షించారు.

Spread the love