క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో పదవ తరగతి టాపర్స్ నగదు పురస్కారం

నవతెలంగాణ-రేవల్లి
మండలం కేంద్రంలో బుధవారం ప్రాథమిక పాఠశాలలో క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపకులు వాస రాఘవేందర్ ఆదేశాల మేరకు, తల్పునూరు ప్రభుత్వ పాఠశాలలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు (1100) నగదు పురస్కారం మరియు ” మెడల్స్ ” తో సన్మానించడం జరిగింది,ఈ సందర్భంగా ఉమ్మడి రేవల్లి, గోపాల్ పేట మండలాల క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షులు బిల్లకంటి నందు మాట్లాడుతూ, విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థుల అందరిని అభినందించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సన్మానించడం జరిగింది,ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరియు క్లాస్మేట్ క్లబ్ మండల ప్రెసిడెంట్ బిల్లకంటి నందు, ఉపాధ్యక్షులు గాజుల రవి, జనరల్ సెక్రెటరీ అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు

Spread the love