సీఎం కేసీఆర్, మంత్రి, ఎమ్మెల్యేకు పాలాభిషేకం

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
దళిత జర్నలిస్టులకు దళితబంధు ప్రకటించడాన్ని హర్షిస్తూ సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీష్ రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ చిత్రపటాలకు దళిత వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సోసైటి హుస్నాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అర్హులైన దళిత జర్నలిస్టులందరికి దళిత వర్తింపజేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న, అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్ లు బోజు రమాదేవి రవీందర్, బోజ్జ హరీశ్. మాజీ జెడ్పీటీ మాలోతు బీలునాయక్, భూక్య లక్ష్మణ్, డీడబ్ల్యుజెఎస్ హుస్నాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు లింగాల ప్రవీణ్. ముఖ్య సలహదారులు గడిపె సతీష్ కుమార్, సహాయ కార్యదర్శి పొడిశెట్టి కుమారస్వామి, కార్యవర్గ సభ్యులు వేల్పుల సంపత్, చిట్యాల పర్శరాములు, చిట్యాల రమేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love