ఏపీలో సీఎం‌ రేవంత్ రెడ్డి బహిరంగ సభ…

CM Revanth Reddyనవతెలంగాణ – అమరావతి
ఏపీలో సీఎం‌ రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ముహుర్తం ఫిక్స్‌ ఖరారు అయింది. మొదట తిరుపతిలో సీఎం‌ రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉంటుందని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటుందని ప్రకటించింది ఏపీ కాంగ్రెస్‌ పార్టీ.ఈ నెల 15 న విశాఖపట్నం ఏపీసీసీ బహిరంగ సభ వాయిదా పడిందని… ఈ నెల 16 న సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంటుందని ఏపీ కాంగ్రెస్ ప్రకటన చేసింది. ఈ బహిరంగ సభలో తెలంగాణ సీఎం‌ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కాంగ్రెస్ బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, జాతీయ నేతలు కూడా హాజరు అవుతారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

Spread the love