నూతన గ్రామపంచాయతీ బిల్డింగ్ పనుల ప్రారంభం

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని రాములపల్లి గ్రామంలో సోమవారం నూతన గ్రామపంచాయతీ బిల్డింగ్ పనులను సర్పంచ్ గంగం మదన్  మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నూతన భవనానికి రూ.20 లక్షలతో మంజూరు అయినట్లు తెలిపారు. భవన నిర్మాణం పనులు వేగవంతంగా చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఉపసర్పంచ్ ఆకుల హరీష్ , పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love