ఉపాధ్యాయులకు సత్కారం..

నవతెలంగాణ-గోవిందరావుపేట
నిన్న జరిగిన 75 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా గిరిజన సంక్షేమ శాఖ ఐ. టి. డి. ఏ, ఏటూరునాగారం పరిధిలో గల ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఆశ్రమ పాఠశాలల /వసతి గృహలలో సేవలoదించిన ఉద్యోగులకు గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్  అంకిత్. ఐ.ఏ.ఎస్, ఏటూరునాగారం లో ఘనంగా ప్రశంష పత్రాలతో సత్కారించడం జరిగింది. శనివారం  అందులో భాగంగా గోవిందరావుపేట లో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల కర్లపల్లి ఉపాధ్యాయులు అజ్మీరా. రాజు,హిందీ గ్రేడ్..2 యాలం. ఆదినారాయణ స్పోర్ట్స్ ఆఫీసర్ ములుగుతో పాటు పాఠశాల గణితం ఉపాధ్యాయులు. శ్రీ. యాప. సమ్మయ్య గారిని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ. కల్తీ. శ్రీనివాస్ గారు,పాఠశాల బృందం ఘనంగా సత్కారించారు. ఇక  కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.దయసాగర్, పీ అశోక్, జగపతి రావు, సమ్మయ్య, రాములు, లక్ష్మయ్య, మల్లయ్య, రాజు, బాలు, కృష్ణమూర్తి, రమణి, ఆదిలక్ష్మి తదితరులుపాల్గొన్నారు.
Spread the love