కవాడిగూడలో సీపీఐ(ఎం) ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు సేవ కార్యక్రమాలు చేయడానికి తనకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం) ముషీరాబాద్‌ అభ్యర్థి దశరథ్‌ ప్రజలను కోరారు. బుధవారం నియోజక వర్గంలోని కవాడిగూడలో పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి దశరథ్‌ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ప్రజా సమస్యలపై, ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, హక్కుల కోసం అనేక పోరాటాలు జరిపి విజయాలు సాధించిందని గుర్తు చేశారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) మరిన్ని పోరాటాలు, సేవా కార్యక్రమాలు జరపడానికి మీరు వేసే ప్రతి ఓటు తోడ్పడుతుందని తెలిపారు.

Spread the love