జడ్జికి రూ.50 వేలు బురిడీ కొట్టిన సైబర్ నేరగాళ్ళు

నవతెలంగాణ – మహారాష్ట్ర : మహారాష్ట్రలోని సోలాపుర్‌కు చెందిన జిల్లా జడ్జికి శుక్రవారం ఓ వాట్సప్‌ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వివరణ  ఏంటంటే ‘నేను ముంబై హైకోర్టు న్యాయమూర్తిని, నాకు ఒక రూ.50 వేలు పంపండి. సాయంత్రం వరకూ మళ్లీ ఇస్తానంటూ సైబర్ నేరగాళ్ళు మెసేజ్ చేశాడు. వాట్సప్‌ డీపీలో న్యాయమూర్తి ఫొటో ఉండటంతో నిజమేనని నమ్మిన జిల్లా జడ్జి డబ్బు ఆ నెంబర్‌కు పంపించారు. ఈ క్రమంలోనే ఆగంతకుడి నుంచి పలుమార్లు ఫోన్లు రాగా.. అనుమానం వచ్చిన జడ్జి, హైకోర్టు రిజిస్ట్రార్‌ను సంప్రదించారు. అక్కడే అసలు విషయం బయట పడింది. అసలు ఆయన ఎవరిని డబ్బు అడగలేదని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన జడ్జి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.

Spread the love