– బలగం సినిమా సింగర్లు మొగిలయ్య, కొమురమ్మలకు
దళిత బంధు కారు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దళితులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందనీ, ఇందుకు నిదర్శనమే బలగం సినిమాలో పాటలు పాడిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు దళిత బంధు పథకం కింద కారు పంపిణీ చేయడమేనని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో కారును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, మూడేండ్లలో దళితులందరికి దళిత బంధు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మొగిలయ్య, కొమురమ్మ దంపతులు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలిచిన మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, బేడ బుడగ జంగాల జెఎసి చైర్మన్ టి.జగదీశ్వర్, వైస్ చైర్మన్ చింతల యాదగిరిలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే బేడ బుడగ జంగాల ప్రతినిధిగా చింతల యాదగిరికి తగిన పదవి ఇచ్చి, గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సుంకె రవిశంకర్, జోగినపల్లి శ్రీనివాసరావు, బేడ బుడగ జంగాల జేఏసీ చైర్మెన్ టి.జగదీశ్వర్, వైస్ చైర్మెన్ చింతల యాదగిరి, బేడ బుడగ జంగాల జేఏసీ నేతలు చింతల దశరథ, విభూది నర్సింహులు, తిరుపాటి రామదాసు, పర్వత మధు, గోపాల్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.