వెల్లంపల్లి నారాయణ మృతి సీపీఐ(ఎం)కి తీరని లోటు

పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ -కూసుమంచి
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జుల్‌రావు పేట గ్రామ సీనియర్‌ నాయకులు వెల్లంపల్లి నారాయణ మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కల్లూరి గూడెం సొసైటీ మాజీ చైర్మెన్‌ వెల్లంపల్లి ఆశోక్‌ తండ్రి వెల్లంపల్లి నారాయణ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న తమ్మినేని వీరభద్రం మంగళవారం మృతదేహంపై ఎర్రజెండా కప్పి, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి నారాయణ అని గుర్తు చేశారు. నివాళులర్పించిన వారిలో.. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రమేష్‌, ఐద్వా రాష్ట్ర నాయకులు బుగ్గవీటి సరళ, మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, మండల నాయకులు, గ్రామ కార్యదర్శి తాటి నర్సింహారావు, వార్డు మెంబర్‌ దాట్ల ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love