మతోన్మాద మోడీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మతోన్మాద ఫాసిస్టు బీజేపీ మోడీ పరిపాలనలో నిరుద్యోగం, ఆకలి, అసమానతలు, అధిక ధరలు, మహిళలపై అత్యాచారాలు, కవులు, కళాకారుల, మేధావుల పై దాడులు తీవ్రమైనాయని సీసీఐఎంఎల్ లో డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు అన్నారు. జక్రాన్ పల్లి బస్టాండ్ కూడలి, అర్గుల్, తోర్లికొండ ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారాన్ని న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. దాసు మాట్లాడుతూ.. బీజేపీ మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చి రైతు వ్యవసాయ వ్యతిరేక విధానాలు అవలంబించాలని ఆయన అన్నారు. ఉపాధి భద్రత, ప్రతి యాడాది రెండు కోట్ల కొలువులు హామీ నీళ్ల మూటగా మార్చారని ఆయన తెలిపారు. నిత్యవసర సరుకుల ధరలను ఆకాశానికి అంటించినారని ఆయన అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయకుండా, కనీస వేతనాల చట్టాలు అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని  ఆయన విమర్శించారు. బేటి పడావో బేటి బచావో నినాదం ఇచ్చిన మోడీ ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి శిక్ష పడకుండా అండగా నిలిచిందని ఆయన అన్నారు. ప్రభుత్వ సొమ్మును కాజేసిన విజయ్ మాల్యా, నీరడ్ మోడీ లాంటి వారికి శిక్షించకుండా అవినీతిపరులకు అండగా నిలిచిందని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించడం దుర్మార్గమని, మతవైషామ్యాలు పెంచి ఓట్లు కొల్లగొట్టే కుట్ర బీజేపీ చేస్తుందని వారన్నారు. అంబానీ ఆదాని లాంటి పెట్టుబడిదారులకు 17 లక్షల కోట్లు మొండి బకాయిల పేరుతో రద్దుచేసి, ప్రజలపై పన్నుల భారం మోపిందని ఆయన అన్నారు. బీజేపీ మోడీ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమిస్తున్న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఎన్నికల్లో బిజెపిని ఓడించి, బీజేపీ నియంతృత్వ పాసిస్టు విధానాల్ని కట్టడి చేసేందుకు ఈ ఎన్నికల్లో ఓడించి, ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డి ని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమం లో సూర్య శివాజీ, ప్రిన్స్, మహమ్మద్ గంగాధర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love