నవతెలంగాణ – హైదరాబాద్: రైతు రుణమాఫీ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రైతు రుణమాఫీ తాము అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పలేదని అన్నారు. రుణమాఫీ చేస్తామని తప్పనిసరిగా చేసి చూపిస్తామన్నారు. ఆర్థిక పరిస్థిని బట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత స్పష్టంగా విధానపరమైన నిర్ణయం ప్రకటిస్తామిన్నారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ‘విద్యుత్-త్రాగునీరు-ఆర్థికం’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతురుణ మాఫీపై రాజకీయం హాట్ హాట్ గా సాగుతున్న వేళ భట్టి విక్రమార్క చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. ఎవరెన్ని కుట్రలు చేసిన ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.