గ్రామాల్లో అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని పిరాట్వానిపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, మండల అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు, యూత్ నాయకులు పాల్గొని పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మల్లురవి గెలుపు కొరకు గ్రామాల్లో విస్తృత ప్రచారం కొనసాగించారు. నాగర్ కర్నూల్ ఎంపీగా పని చేసిన అనుభవం ఉన్న ఈ ప్రాంత సుపరిచితుడు పిలిస్తే పలికే మల్లు రవి నీ గెలిపించడం వల్ల నల్లమల ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కిందన్నారు. కేంద్రంలో కూడా రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేసి తీరుతుందని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టోను గ్రామీణ ప్రాంత ప్రజలు ఆదరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన, స్వాతంత్రాన్ని తెచ్చిన, పేద ప్రజలకు సంక్షేమలు అందించిన కాంగ్రెస్ పార్టీకి మనమెంతో రుణపడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి డా.మల్లు రవి ని గెలిపించి పార్లమెంట్ పంపాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love