భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు

మామిడి హరికృష్ణకు పితృ వియోగం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తండ్రి మామిడి సుదర్శన్‌ (86) శనివారం ఉదయం శాయంపేటలో మరణించారు. ఆయన రెండేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వరంగల్‌ ఆయుర్వేద కళాశాల నుంచి పట్టా పుచ్చుకున్న ఆయన ప్రజలకు విస్తృత వైద్య సేవలందించారు. సాహిత్య విశ్లేషకుడిగా, రాజకీయ సమీక్షకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పెద్ద కుమారుడైన హరికృష్ణ ప్రస్తుతం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా పని చేస్తున్నారు.

Spread the love