– టీటీడీపీ మండలాధ్యక్షుడు కొమ్మెర నరేందర్ రెడ్డి అసహనం
– ఎమ్మెల్సీ పాడి కౌశీక్ రెడ్డిని భర్తరఫ్ చేయాలని డిమాండ్
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే చట్ట సభలకు ప్రాతినిద్యం వహించే హోదాలో ఉండి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ పాడి కౌశీక్ రెడ్డి కులాలకు చెందిన వారిపై అసభ్యకరంగా దూషణలేంటని టీటీడీపీ మండలాధ్యక్షుడు కొమ్మెర నరేందర్ రెడ్డి అదివారం అసహనం వ్యక్తం వ్యక్తం చేశారు. చట్ట సభలపై కనీస అవగాహన లేని ఎమ్మెల్సీ పాడి కౌశీక్ రెడ్డిని సీఎం కేసీఆర్ వెంటనే భర్తరఫ్ చేసి తన చిత్తశుద్దిని చాటాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.