ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : వరంగల్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం కటాక్షపూర్​ వద్ద కారును టిప్పర్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మేడారం దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  మృతులు ఎవరన్న విషయం ఇంకా తెలియరాలేదు.

Spread the love