ఈ బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ బైక్ ను #TSRTC బస్సుకు ఢీకొట్టాడు. ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం… pic.twitter.com/5zv1y04a6X
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 17, 2023
నవతెలంగాణ-హైదరాబాద్ : తల్లిదండ్రుల కళ్ల ముందే కన్న కొడుకులిద్దరూ మృతి చెందిన విషాద ఘటన ములుగు జిల్లా మంగపేటలో చోటుచేసుకుంది. తమ ఇద్దరు కుమారులతో కలిసి ద్విచక్రవాహనంపై మంగపేటకు బయలుదేరిన మాడవి సురేశ్ దంపతులు.. తెలంగాణ సెంటర్ వద్ద బస్టాండు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను టీఎస్ఈర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్లో షేర్ చేశారు. డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.