రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఎమ్మెల్యే కృషి ఫలితమేనన్న మేయర్

నవతెలంగాణ- కంటేశ్వర్
రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకల్లో భాగంగా ఉత్తమ హరితహారం నిర్వహణ నగరంగా నిజామాబాద్ నగరానికి వచ్చిన అవార్డుకు గాను ఎమ్మెల్యే గణేష్ గుప్త ని క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చన్ని అందించి శనివారం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ వేడుకల్లో భాగంగా అర్బన్ డే కార్యక్రమంలో లక్షకుపై జనాభా గల నగరం కేటగిరిలో ఉత్తమ హరితహారం నిర్వహణకుగాను మన నగరానికి వచ్చిన గుర్తింపు మన ఎమ్మెల్యే గణేష్ కృషి పట్టుదల తోనే సాధ్యమైందని మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హరితహారం కార్యక్రమాన్ని ప్రణాళిక బద్దంగా నిత్యం పర్యవేక్షస్తూ, ప్రజలకు ఆహ్లాదకరమైన పార్కులను అభివృద్ధి చేస్తూ తెలంగాణ రాష్టంలోనే హైదరాబాద్ తరువాత నిజామాబాద్ నాగరాన్ని అద్భుతమైన కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు.

Spread the love