సుద్దపల్లి లో సిసీ డ్రైనేజ్,రాహదరి పనులు ప్రారంభం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో 15 ఫైనాన్సు నిధుల నుండి గ్రామంలోని 7వ వార్డులో సిసి, రాహదరికి, డ్రైనేజ్ నిర్మాణా పనులను శనివారం సర్పంచ్ సర్పంచ్ పానుగంటి రూపా సతీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూపా సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను మంజూరు చేస్తూ గ్రామాన్ని సస్యశ్యామలం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించి చేయించడం జరుగుతుందని సర్పంచ్ పానుగంటి రూపా సతీష్ రెడ్డి వివరించారు.ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ ఎంబడి సంతోషం, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి నరహరి, భూమయ్య, సాయిలు, బాపురావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజుగౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love