నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిల్లోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం మూడు విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఆయా డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్లో ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దోస్త్కు దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేయనుంది. పూర్తి వివరాలు రేపు తెలియనున్నాయి.