దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ

మొదటి రోజు 4,722 దరఖాస్తులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్‌, బీకాం ఆనర్స్‌, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, బీసీఏ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్‌, దోస్త్‌ కన్వీనర్‌ ఆర్‌ లింబాద్రి ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి రోజు దోస్త్‌కు 4,722 దరఖాస్తులొచ్చా యని వివరించారు. ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు వచ్చేనెల 10వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు గడువున్నదని తెలిపారు. ఈనెల 20 నుంచి వచ్చేనెల 11వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశమున్నదని పేర్కొన్నారు. వచ్చేనెల 16వ తేదీన తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుంది. విద్యార్థులు పూర్తి వివరాలకు https://dost. cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ ఏడాది విద్యార్థుల కోసం ప్రత్యేకంగా దోస్త్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కోరారు.

Spread the love