దోస్త్‌కు 32,362 మంది రిజిస్ట్రేషన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్‌, బీకాం ఆనర్స్‌, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, బీసీఏ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌)కు 32,362 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్‌, దోస్త్‌ కన్వీనర్‌ ఆర్‌ లింబాద్రి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు వచ్చేనెల 10వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు గడువున్నదని తెలిపారు. వచ్చేనెల 11వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశమున్నదని పేర్కొన్నారు. వచ్చేనెల 16వ తేదీన తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు పూర్తి వివరాలకు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Spread the love