సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా గుడ్ ఫెల్లోస్ మీడియా ప్రొడక్షన్స్, సఫైరస్ మీడియా, వెడ్నెస్డే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ద్రోహి’. ది క్రిమినల్ అనేది ఉపశీర్షిక. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజరు పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, విజరు పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలు.
ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమాకు సంబంధించిన లుక్, గ్లింప్స్ చూశాను. చాలా ప్రామిసింగ్గా ఉంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను’ అని చెప్పారు.
‘చక్కని థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’ అని దర్శక, నిర్మాతలు అన్నారు.