– ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో మృతి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చల్లమల్ల శ్రీనివాస్రావు భార్య బండి విజయలక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్ పోస్టు కేటాయిస్తూ రెవెన్యూ ముఖ్యకార్యదర్శి నవీన్మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నియామక పత్రాలను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో జరిగిన హరితహారం వేదికపై సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందజేశారు.