అ సీఎం కప్ విజేతలను అభినందించిన విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
సీఎం కేసీఆర్ హాయంలోనే క్రీడలకు ప్రాధాన్యత లభించిందని విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కప్ టోర్నమెంటులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాలీబాల్లో కరకగూడెం మండలం టీం ప్రథమ స్థానం రావడం పట్ల క్రీడాకారులను, కోచ్లు కొమరం వెంకటనారాయణ, పీడీఎస్ బాలసుబ్రమణ్యం, పీడీకే నిరాజ్ కుమార్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాతే క్రీడలకు ప్రాధాన్యత లభిస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయతో పాటుగా అన్ని రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని క్రీడా రంగానికి అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నారు. క్రీడాకారుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా 17వేల క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో గ్రామీణ స్థాయి నుండి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే క్రీడలకు ప్రాధాన్యం