బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎర్రబెల్లి

నవతెలంగాణ – రాయపర్తి: మండలంలోని కాట్రపల్లి గ్రామ సర్పంచ్ బోనగిరి ఎల్లయ్య తండ్రి సోమయ్య, తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దొంతరబోయిన యాదగిరి తండ్రి యాకయ్య ఇటీవల అనారోగ్య సమస్యతో మృతిచెందగా శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తదుపరి బిఆర్ఎస్ పార్టీ నాయకుడు బండి ఎల్ల గౌడ్ ఇటీవల అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకొని అండగా ఉంటా ఆధర్యపడవద్దని భరోసా ఇచ్చారు. కార్యకర్తల కుట్టుబాలకు ఎల్లవేళలా వెన్నంటే ఉంటా అని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మునవాత్ నరసింహ నాయక్, సర్పంచ్ అనంత ప్రసాద్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Spread the love