పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి

నవతెలంగాణ – నాగర్‌కర్నూల్ : జిల్లాలోని బిజినేపల్లి మండలం ఖానాపూర్‌ గ్రామంలో విషాదం నెలకొని ఉంది. ఆదివారం సాయంత్రం పిడుగుపాటు వల్ల తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన విరాల ప్రకారం.. మండలంలోని వెలుగొండ గ్రామానికి చెందిన నాగయ్య (55), అతని కుమారుడు రమేశ్‌ (25) బిజినపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని వరి పంటను సాగు చేశారన్నారు. ఈ వరి పంట కోత దశకు రావడంతో ఆదివారం పంట చేను కోపిస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. వీరు ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.

Spread the love