ఇల్లు కోల్పోయిన ఈక లక్ష్మికి ఆర్థిక సహాయం..

నవతెలంగాణ -గోవిందరావుపేట
మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఇటీవల భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన ఈ లక్ష్మి కుటుంబానికి 25వేల రూపాయల చెక్కును మంగళవారం జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి అందించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా చైర్పర్సన్ నాగజ్యోతి మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని లక్ష్మికి సూచించారు. నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం బరోసాతో ఆదుకుంటుందని అన్నారు. ఐటీడీఏ పీవో అంకిత్ కూడా నిరాశ్రయులైన లక్ష్మికి ప్రభుత్వం టీఆర్ఎఫ్ నిధుల ద్వారా ఈ చెక్కును అందిస్తున్నట్లు తెలిపారు. ఎల్లవేళలా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి తహసిల్దార్ అల్లం రాజకుమార్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఎంపీ ఓ సాజిదా బేగం, బీఅర్ఎస్ మండల అధ్యక్షులు సూరపనేని సాయికుమార్, ప్రధాన కార్యదర్శి లకావత్ నర్సింహా నాయక్, కర్లపల్లి, లక్ష్మిపురం గ్రామాకమిటి అధ్యక్షులు  జెల్లల కుమార్, వజ్జ నరేందర్, వార్డ్ నెంబర్ మల్లేష్ , నాయకులు చల్ల ప్రసాద్, రాములు తదితరులు పాల్గొన్నారు.
Spread the love