మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – తాడ్వాయి
 మండల కేంద్రంలోని భూపతి ధనలక్ష్మి అనారోగ్యంతో మృతిచెందగా వారి దశ దినకర్మకు వారి కుమారుడు భూపతి శంకర్ క్లాస్ మెంట్స్ (పూర్వ విద్యార్థులు) కలిసి 7100 ఆర్థిక సహాయం అందించారు. శంకర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. తమ క్లాస్మేట్ శంకర్ తల్లి వియోగంతో బాధలో ఉండగా ప్రామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండూరి శ్రీదేవి నరేష్, తడక సుమన్, పల్లెర్ల ధర్మేందర్, దేవరకొండ రాజు, అపాజి తిరుపతి, బెల్లంకొండ నరేష్, ఎస్ డి కాజా పాషా అల్లే కృష్ణవేణి కవిత విజయలక్ష్మి పాయం లలిత పిన్నోజు సరిత, మృతి రాలి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love