మంత్రి సమక్షంలో కాంగ్రెెస్‌లో చేరిన మాజీ ఎంపీపీ విగ్రాం శ్రీనివాస్‌గౌడ్‌

నవతెలంగాణ-పెద్ద శంకరంపేట్‌
నారాయణఖేడ్‌ నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మాజీ ఎంపీపీ విగ్రాం శ్రీనివాస్‌ గౌడ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పటోళ్ల సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌ కుమార్‌ షెట్కర్‌ సమక్షంలో బుధవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కీర్తిశేషులు విగ్రహం రామా గౌడ్‌ తనయుడు విగ్రహం శ్రీనివాస్‌ గౌడ్‌ కుటుంబం పెద్ద శంకరంపేట మండలంలో 30 సంవత్సరాలుగా రాజకీయ ఉనికిని చాటుకుంటూ వివిధ పదవుల్లో కొనసాగారు. గతంలో పెద్ద శంకరంపేట ఎంపీపీగా రెండు పర్యాయాలు చేయడమే కాకుండా నారాయణఖేడ్‌ నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్‌ కీలక నేతగా కొనసాగారు. గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూపాల్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి అప్పటి రాష్ట్ర మంత్రి సూచన మేరకు పని చేశారు. ఇటీవల కార్యకర్తలు పార్టీ మారాలని మెజార్టీ కార్యకర్తలు సూచించడంతో మండల అభివద్ధి కొరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి సురేష్‌ కుమార్‌ షెట్కార్‌, మలిశెట్టి యాదవ్‌, మహంకాళి కష్ణమూర్తి, రవి గౌడ్‌ పెద్దశెంకరంపేట మండల కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love