ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురుకాల్పులు.. న‌లుగురు మావోయిస్టులు హ‌తం

నవతెలంగాణ – రాయ్‌పూర్: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుక్మా జిల్లాలో తుపాకులు గ‌ర్జించాయి. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో న‌లుగురు మావోయిస్టులు హ‌తమ‌య్యారు. సుక్మా జిల్లాలోని గోగుండా ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు సంభ‌వించిన‌ట్లు పోలీసు ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా సుక్మా ఎస్పీ కిర‌ణ్ చ‌వాన్ మాట్లాడుతూ.. ప‌రారైన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొన‌సాగుతోంద‌ని తెలిపారు. సుక్మా డీఆర్‌జీ, దంతెవాడ డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్ రెండో బెటాలియ‌న్‌కు చెందిన ద‌ళాలు సంయుక్తంగా ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన‌ట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Spread the love